VijayaKumar

Mar 27 2024, 17:27

మోత్కూరు ఎంపీడీవో కార్యాలయం పై ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన పంచాయతీ కార్యదర్శి


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామ పంచాయతీ సెక్రెటరీ కిరణ్. ఓ వ్యక్తి ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేశారు రూపాయలు 3000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సెక్రెటరీ కిరణ్. ఇదివరకే రూపాయలు 5000 ఇచ్చిన బాధితుడు.

VijayaKumar

Mar 27 2024, 13:19

పాము కాటుతో పదవ తరగతి విద్యార్థి మృతి


పాము కాటుతో ఓ పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ముక్కెర్ల మమత, కుమార్ ల కుమారుడైన ముక్కర్ల ఉమేష్ ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున 4.30 గం.లకు కట్లపాము కాటు వేయడంతో భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బుధవారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు దత్తప్ప గూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడన్నారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యార్థి మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

VijayaKumar

Mar 26 2024, 19:10

తుర్కపల్లి మండల కేంద్రము లో ఓ వైన్ షాప్ లో చోరీ... నలుగురు వ్యక్తుల అరెస్ట్: మీడియా సమావేశంలో డిసిపి రాజేష్ చంద్ర


యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని ఇటీవల ఓ వైన్ షాప్ చోరీ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 2 లక్షల 4 వేల నగదుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

VijayaKumar

Mar 26 2024, 18:53

గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం వర్ధంతి


చట్టసభలలో పట్టుబట్టి ప్రజా సంఘాల హక్కులను సాధించిన ప్రజల మనిషి, స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బొమ్మ గానిధర్మబిక్షం 

దేశ, రాష్ట్ర చట్టసభలలో తన గల మెత్తి, పట్టుబట్టి

ప్రజా సంఘాల హక్కులను సాధించినమహాయోధుడైన స్వర్గీయ కామ్రేడ్ బొమ్మ గాని ధర్మ బిక్షం గారి 13వ వర్ధంతి సందర్భంగా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామం పరిధిలోని తాటి వనంలో సిపిఐ పార్టీ గీతా పనివారల సంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు శాంతి కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ ధర్మాభిక్షం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడని పేర్కొన్నారు.

1957 వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా పరిధిలోని గార్ల గ్రామంలో గీత పనివాళ్ల సంఘాన్ని స్థాపించాడని, అనంతరం ప్రతి గ్రామంలో గీత పని వారల సంఘాలను ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు.

1952 వ సంవత్సరంలో ఉమ్మడి జిల్లా లోని సూర్యాపేట ఎమ్మెల్యేగా,

1957 నో నకిరేకల్ ఎమ్మెల్యేగా, 1963 లో నల్లగొండ ఎమ్మెల్యేగా ధర్మ బిక్షం గెలుపొందడం జరిగిందని, అలాగే/1990--92 సంవత్సరాలలో రెండుసార్లు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ నుండి విజయం సాధించాడని ఆయన తెలిపారు.

ప్రజా ప్రతినిధిగా చట్టసభలలో ప్రజా సంఘాల హక్కులకై తన గలమెత్తి, పట్టుబట్టి హక్కులను సాధించిన మహాయోధుడని కొనియాడారు.

గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి మృతి చెందిన కుటుంబాలకు ధర్మ బిక్షం ప్రభుత్వాలతో పోరాడి ఎక్స్గ్రేషన్ మంజూరు చేయించిన ఘనుడన్నారు.

ఈ ఎక్స్గ్రేషియా తొలుత 

10వేల రూపాయలు ఉండగా అంచేలంచలుగా

2 లక్షల రూపాయల వరకు చేయించాడని, అలాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతిగీత కార్మికునికి200

రూపాయలు పెన్షన్ మంజూరు చేయించిన మహానుభావుడ నీ ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ప్రతి గ్రామానికి తాటి ,ఈత చెట్లు పెంపొందించుకునేందు కై

ప్రభుత్వాలతో పోరాడి 5 ఎకరాల భూమిని కేటాయించాలని పట్టుబట్టి 560 జీవోను సాధించిన ఘనుడు ధర్మ బిక్షమని పేర్కొన్నారు.

తన జీవితాన్ని ఉద్యమాలకు, పోరాటాలకు, ప్రజా హక్కుల సాధనకై గడిపిన ధర్మభిక్షం ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిమ్మల అంజయ్య గౌడ్, చిలుకూరి లక్ష్మయ్య గౌడ్, జలంధర్, సైదులు, వెంకట్ నర్సు, కుమ్మరి మల్లయ్య, బోడ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Mar 26 2024, 18:23

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి


బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి ని మంగళవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో బెహెన్ జీ కుమారి మాయావతి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నియమించారు. తెలంగాణ చీఫ్ గా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రాజీనామా నేపథ్యంలో పార్టీ పట్ల విధేయత కలిగిన వారికి, రాజీ పడని వారికి అవకాశమిస్తే బహుజన వాదం గెలుస్తుందన్న ఆలోచనతోనే ఈ నియామకం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి నకిరేకల్ నియోజకవర్గంలో గడపగడపకు ఏనుగు గుర్తును ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లామన్నారు.బహుజనుల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అన్నారు. బహుజనులంతా ఏకతాటిపై వచ్చి అన్ని రంగాల్లో తమ వాటా సాధించుకోవాలన్నారు. తనకు రాష్ట్ర కమిటీ లో చోటు కల్పించిన నేషనల్ కో ఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతం , రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మరియు నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

VijayaKumar

Mar 26 2024, 18:04

భువనగిరి భాజపా పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో రజాకార్ సినిమా ప్రదర్శన


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ని శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్ లో గూడూరు నారాయణరెడ్డి నిర్మాత గా యాట సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మించిన రజాకార్ సినిమాను మంగళవారం, బుధవారం రోజులలో ఈ సినిమాని రెండు షోలు భారతీయ జనతాపార్టీ సినియర్ నాయకులు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో రజాకార్ సినిమాను రెండు రోజులు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.

వలిగొండ మండల ప్రజలు నాయకులు బిజెపి పార్టీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వలిగొండ సినిమా థియేటర్ కు వచ్చి రజాకార్ సినిమాలు తిలకించి ఆనాడు రజాకారుల నాయకుడు కాశీం రజ్వి చేసిన అరాచకాలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన రజాకార్ సినిమా దర్శకులు యాట సత్యనారాయణకు నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన మండలం భాజపా నాయకులు ఎన్నో వ్యయ ప్రయాసలను భరించి ఈ రజాకార్ సినిమా నిర్మించినందుకుగాను వారికి వారి సినిమా యూనిట్ కు ధన్యవాదములు తెలుపవలసిందిగా కోరడం జరిగినది. ఈ సినిమా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఇతరులకు చూసే విధంగా ప్రోత్సహించాలని కోరడం జరుగుతుంది. మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ బచ్చు శ్రీనివాస్ గుప్తా, భాజపా కిసాన్ మోర్చా మండల శాఖ అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్, సీనియర్ నాయకులు దంతూరి సత్తయ్య, గౌడ్ సీలోజు శ్రీరాములు, బందారపు రాములు, రాచకొండ కృష్ణ, బాసవాడ బిక్షపతి, మంద నరసింహ, తదితర నాయకులు మండల ప్రజలకు రజాకార్ సినిమాను తిలకించవలసిందిగా కోరడం జరుగుతుంది.

VijayaKumar

Mar 26 2024, 17:26

ప్రజా పాలనకు వంద రోజులు ప్రజా నాయకుడికి 100 ప్రశ్నలు లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ప్రజా పాలనకు వంద రోజులు ప్రజా నయకుడికి 100 ప్రశ్నలు కార్యక్రమంలో భాగంగా భువనగిరి పరిధిలోని దీప్తి హోటల్ నందు మంగళవారం రెండు గంటలకు ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల్లో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని ఇప్పటికే 118 గ్రామాల్లో పర్యటించి అండర్ పాస్ ను సాంక్షన్ చేశామని అన్నారు. యాదాద్రి ని యాదగిరిగుట్ట గా పేరు మార్చామని కొండపైకి ఆటోల కు అనుమతి కల్పించి 300 కార్మికుల సమస్యలను తీర్చామని అన్నారు. కొండపైన భక్తులు నిద్రించే సౌకర్యం కల్పించడం జరిగిందని మరియు కొబ్బరికాయలు కొట్టే స్థలం ఏర్పాటు చేశామని అన్నారు.

VijayaKumar

Mar 26 2024, 17:20

దాసిరెడ్డి గూడెంలో మాజీ మావోయిస్టు సాంబశివుడి 13వ వర్ధంతి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో. ఉద్యమాల యుద్ధభేరి. సాంబశివుడు 13వ వర్ధంతిని.

 ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్వర్ణలత కూతురు అల్లుడు అనిల్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అడవిని వదిలి, ప్రజలకు సేవ చేసే క్రమంలో ఓర్వ లేక హత్య చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నారి మల్లేష్ ,నారి నరసింహ, నారి శ్రీశైలం, నారి బాలకృష్ణ ,సాయికుమార్ మరియు మండల టిఆర్ఎస్ నాయకులు తుమ్మల వెంకటరెడ్డి. కొమిరెల్లి సంజీవరెడ్డి. పడమటి మమత నరేందర్ రెడ్డి. డేగల పాండు. మాద శంకర్ లావణ్య. దామోదర్ రెడ్డి. పాల్గొని ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పించారు.

VijayaKumar

Mar 24 2024, 23:22

చిత్తాపురం స్టేజి వద్ద స్కూటీని ఢీ కొట్టిన కారు పలువురికి గాయాలు కేసు నమోదు చేసిన వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాలడుగు గ్రామానికి చెందిన యాస బిక్షం రెడ్డి తన కూతురి వివాహ పత్రికలు తీసుకుని చిత్తాపురం లో ఇచ్చి తిరుగు ప్రయాణంలో స్కూటీ పై చిత్తాపురం స్టేజి వద్దకు రాగానే అతివేగంగా, జాగ్రత్తగా వచ్చిన కారు ఢీకొట్టడంతో బిక్షం రెడ్డి తలకి, చేతులకి, కాళ్ళకి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం నల్గొండ లోని ఐకాన్ హాస్పిటల్ కి తరలించారు . కారులో ప్రయాణిస్తున్న పోలంగరి శ్రీనివాస్ రెడ్డి, పద్మావతి, బాలకృష్ణ రెడ్డి, సంధ్య లకు కూడా గాయాలయ్యాయి. కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాస బిక్షం రెడ్డి అల్లుడు బొక్క సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

VijayaKumar

Mar 24 2024, 17:21

బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులుగా బచ్చు శ్రీనివాస్ గుప్త నియామకం


 

భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల కేంద్రంకు చెందిన బచ్చు శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు గా ఎంపిక కావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అద్యక్షులు పాశం భాస్కర్ నియామక పత్రం ను వారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన వలిగొండ మండల అద్యక్షులు బోల్ల సుదర్శన్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు CN రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,పార్లమెంట్ కన్వినర్ బందారపు లింగ స్వామి గౌడ్ , స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్ర శేఖర్, జిల్లా సెక్రటరీ కొప్పుల యాదిరెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య గౌడ్ సీనియర్ నాయకులందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని గ్రామాల్లో పార్టీ పటిష్టతకు పని చేస్తానని,పార్టీ పిలుపు మేరకు పని చేస్తానని వారు అన్నారు.